బీఐఎస్‌ నమోదిత పసిడి విక్రేతల సంఖ్య మూడింతలు

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వద్ద నమోదైన పసిడి వర్తకుల సంఖ్య నవంబరు 15కు మూడింతలు అధికమై 1,24,034కు చేరింది.

Published : 02 Dec 2021 01:59 IST

ముంబయి: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వద్ద నమోదైన పసిడి వర్తకుల సంఖ్య నవంబరు 15కు మూడింతలు అధికమై 1,24,034కు చేరింది. ఈ ఏడాది జూన్‌ నుంచి పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం, దశల వారీగా దీనిని అమలు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం తర్వాతే నమోదిత వర్తకుల సంఖ్య పెరిగినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. జూన్‌లో బీఐఎస్‌ నమోదిత వర్తకుల సంఖ్య 43,153 మాత్రమే అని తెలిపింది. అసేయింగ్‌, హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు (ఏహెచ్‌సీలు) సంఖ్య కూడా 948 నుంచి 978కు పెరిగింది. హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల వినియోగదారు విశ్వాసం బలోపేతమైందని జీజేఈపీసీ ఛైర్మన్‌ కొలిన్‌ షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని