₹1.5 లక్షల అదనపు మినహాయింపు క్లెయిమ్ చేశారా?
గృహ రుణం తీసుకుని మొదటిసారి ఇల్లు కొనుగోలు చేశారా? ఒకవేళ మీరు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇల్లు కొనుగోలు చేసి వుంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల అదనపు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. సరసమైన ధర(ఎఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్)లో ఇళ్ళను
గృహ రుణం తీసుకుని మొదటిసారి ఇల్లు కొనుగోలు చేశారా? ఒకవేళ మీరు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇల్లు కొనుగోలు చేసి వుంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల అదనపు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. సరసమైన ధర(ఎఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్)లో ఇళ్ళను కొనుగోలు చేసేవారికి సహాయపడేందుకు 2019 కేంద్ర బడ్జెట్లో ఈ మినహాయింపును ప్రవేశపెట్టారు.
అదనపు మినహాయింపు పొందాలంటే…
* ఏప్రిల్ 1, 2019- మార్చి 31,2020 మధ్యలో గృహ రుణం మంజూరు అయుండాలి.
* ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షల వరకు ఉండొచ్చు.
* మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసిన పన్ను చెల్లిందారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
* రుణం మంజూరు చేసిన తేదీ నాటికి పన్ను చెల్లిందారుని పేరుపై ఎటువంటి నివాస గృహ ఆస్తిని కలిగి ఉండకూడదు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(బి) కింద గృహ రుణ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు మినహాయంపు లభిస్తుంది. దీనికి అదనంగా మరో రూ.1.5 లక్షలు సెక్షన్ 80ఈఈఏ ప్రకారం మినహాయంపు పొందొచ్చు. అయితే ఒకే మొత్తంపై రెండు మినహాయింపులను క్లెయిమ్ చేయరాదు.
ఉదాహరణకి, గృహ రుణం రూ.3.5 లక్షల వడ్డీ చెల్లిస్తున్నారు అనుకుందాం. అందులో రూ.2 లక్షలు సెక్షన్ 24(బి) ప్రకారం, రూ.1.5 లక్షలు సెక్షన్ 80ఈఈఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ గృహ రుణ వడ్డీ కింద రూ.1.5 లక్షలు వడ్డీ చెల్లిస్తుంటే ఏదో ఒక సెక్షన్ కింద మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి. రెండింటి కింద క్లెయిమ్ చేయకూడదు. సెక్షన్ 24(బి) కింద మొదటగా క్లెయిమ్ చేసుకుని, మిగిలిన మొత్తంపై సెక్షన్ 80ఈఈఏ ప్రకారం క్లెయిమ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సెక్షన్ 80ఈఈ ప్రకారం రూ.50 వేలు మినహాయింపు క్లెయిమ్ చేసుకునే వారికి సెక్షన్ 80ఈఈఏ కింద మినహాయింపు వర్తించదు. ఏప్రిల్1,2016 నుంచి మార్చి31,2017 మధ్యలో గృహ రుణం మంజూరు అయిన వారికి మాత్రమే సెక్షన్ 80ఈఈ కింద మినహాయింపు వర్తిస్తుంది. రూ.50 లక్షలతో ఇల్లు కొనుగోలు చేసి రూ.35 లక్షల గృహ రుణం తీసుకున్న వారికి సెక్షన్ 80ఈఈఏ, సెక్షన్ 24(బి) కింద మినహాయింపు వర్తించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు