Hyundai i20 N Line: హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్లిఫ్ట్.. ధర, ఫీచర్ల వివరాలివే!
Hyundai i20 N Line ఫేస్లిఫ్ట్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో భద్రత, డిజైన్, ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐ20 ఎన్ లైన్ (Hyundai i20 N Line) ఫేస్లిఫ్ట్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.12.32 లక్షలుగా పేర్కొంది. భద్రత, డిజైన్, ఫీచర్ల పరంగా ఇందులో కొన్ని మార్పులు చేశారు. ఈ కారును కొత్తగా ఐ20 ఎన్ లైన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ఐ20 మోడల్ నుంచి టర్బో ఇంజిన్ వేరియంట్ను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ కారుపై మూడేళ్లు లేదా లక్షన్నర కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారెంటీ ఇస్తున్నారు.
హ్యుందాయ్ కొత్త ఐ20 ఎన్ లైన్లో 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్తో 1.0 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 118 బీహెచ్పీ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నార్మల్, స్పోర్ట్, ఈకో అనే మూడు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ‘‘ప్రీమియం హ్యాచ్బ్యాక్ శ్రేణిలో ఎన్నో ఏళ్లుగా ఐ20 సిరీస్ను వినియోగదారులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఐ20 ఎన్ లైన్ ఫేస్లిఫ్ట్లో డిజైన్, ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేశాం. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని కారు లోపలి భాగాలను డిజైన్ చేశాం. ఇది తప్పకుండా యువతను ఆకర్షిస్తుంది’’ అని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు.
భారత్లో ప్రారంభమైన ఐఫోన్ 15 అమ్మకాలు.. లాంచ్ ఆఫర్లివే
ఐ20 ఎన్ లైన్ను భద్రత పరంగా మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్బ్యాగులు సహా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. ఇంటీరియర్ విషయానికొస్తే.. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేశారు. 60 కనెక్ట్ ఫీచర్లు, ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, 127 బిల్ట్-ఇన్ వాయిస్ రికగ్నిషన్ కమాండ్స్, టైప్-సి ఛార్జర్, ఏడు స్పీకర్లతో బాస్ సౌండ్ సిస్టమ్ వంటి సదుపాయాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
Edelweiss CEO Radhika Gupta Zomato, Swiggy: మ్యుచువల్ ఫండ్స్ సంస్థ ఎడిల్విస్ సీఈఓ రాధికా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటోతోనే పోటీ అని అన్నారు. -
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..
Sovereign Gold Bond: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 2 విడతల్లో సార్వభౌమ పసిడి బాండ్ల ప్రభుత్వం జారీ చేయనుంది. బాండ్ల జారీ చేసే తేదీలను వెల్లడించింది. -
Narayana Murthy: 40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి
Narayana Murthy: వారానికి 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సమర్థించుకున్నారు. తాను 40 ఏళ్ల పాటు అలాగే పనిచేశానని తెలిపారు. -
వృద్ధిరేటు అంచనా 7 %
వరుసగా అయిదో ద్వైమాసిక సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. -
చక్కెర మిల్లులపై అంబానీ దృష్టి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా చక్కెర మిల్లులపై దృష్టి సారించిందని వార్తలొస్తున్నాయి. -
షేర్లు కొన్న రోజే సెటిల్మెంట్!
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అమ్మినా, కొనుగోలు చేసినా అదే రోజు సెటిల్మెంట్ చేసే ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నామని సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్ తెలిపారు. -
నిఫ్టీ @ 21,000
గురువారం నాటి నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు, శుక్రవారం సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 70,000 పాయింట్లకు చేరువ కాగా.. నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి ఇంట్రాడేలో 21,000 పాయింట్లను అధిగమించింది. -
ఈక్విటీ ఫండ్లలో తగ్గిన పెట్టుబడులు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి గత నెలలో నికరంగా రూ.15,536 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్లు భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) వెల్లడించింది. -
పర్యావరణం, సమాజానికి చేయూత అందించాలి
పర్యావరణానికి మేలు చేసేలా, సమాజాభివృద్ధికి ఉపకరించే సానుకూల దృక్పథంతో కంపెనీలు వ్యవహరించాలని విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ తెలిపారు. -
వరద ప్రభావిత వినియోగదార్లకు అత్యవసర సేవాకేంద్రం: ఎస్బీఐ జనరల్
తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న తమిళనాడు వినియోగదార్లకు సేవలు అందించేందుకు అత్యవసర సేవా కేంద్రాన్ని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. -
ఐఫోన్ కొత్త ప్లాంట్కు టాటాల సన్నాహాలు
దేశంలో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. -
ఓటీటీ ఆదాయాల్లో ఏటా 25% వృద్ధి
భారత్లో ఓటీటీ (ఓవర్-ద-టాప్) వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని నెట్ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు
మన దేశానికి స్వాతంత్య్రం లభించి శతాబ్ది కాలం పూర్తయ్యే 2047కు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోహ్రి శుక్రవారం వెల్లడించారు. -
YouTube: యూట్యూబ్లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!
YouTube: కంటెంట్ క్రియేటర్లకు వారి కామెంట్ సెక్షన్పై మరింత నియంత్రణ కల్పించేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. -
boAt smartwatch: జియో e-సిమ్తో బోట్ తొలి స్మార్ట్వాచ్
boAt Lunar Pro LTE: ఇ-సిమ్ సపోర్ట్తో బోట్ తొలి స్మార్ట్వాచ్ తీసుకొస్తోంది. అంటే కాల్స్, మెసేజులు వంటి వాటికి ఇక స్మార్ట్ఫోన్ అక్కర్లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీల్లో 2 పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు