వరుసగా నాలుగో రోజు పెరిగిన చమురు ధరలు
కొద్ది రోజులపాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
దిల్లీ: కొద్ది రోజులపాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 31 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర రూ.91 దాటింది. దిల్లీలో గురువారం పెట్రోల్ ధర రూ.90.99 ఉండగా నేడు పెరిగిన ధరలతో రూ.91.27కు చేరింది. డీజిల్ ధర గురువారం రూ.81.42 ఉండగా నేడు రూ.81.73కి చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.68, లీటర్ డీజిల్ ధర రూ.89.11కు చేరింది. ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.61, డీజిల్ ధర రూ.88.82గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.