అక్కడ పెట్రోల్‌ సెంచరీ కొట్టేసింది!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నూరు రూపాయల దిశగా పెట్రోల్‌ ధర పరుగులు పెడుతోంది. అయితే, మహారాష్ట్రలోని పర్భని ..

Published : 14 Feb 2021 17:14 IST

ముంబయి: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నూరు రూపాయల దిశగా పెట్రోల్‌ ధర పరుగులు పెడుతోంది. అయితే, మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్‌ ధర సెంచరీ చేరింది. యాడిటివ్స్‌తో కూడిన పెట్రోల్‌ (వాహన పనితీరు మెరుగుపర్చేందుకు పెట్రోల్‌లో రసాయనాలు కలుపుతారు) ధర రూ.100 దాటినట్లు పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడొకరు తెలిపారు. ఆదివారం ఉదయం పెట్రోల్‌ ధర మరో 28 పైసలు పెరగడంతో రిటైల్‌గా విక్రయించే పెట్రోల్‌ ధర రూ.100 దాటినట్లు పేర్కొన్నారు. సాధారణ పెట్రోల్‌ ధర రూ.97.38గా ఉందన్నారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు అందుకు కారణం. పైగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ధరలు కాస్త ఎక్కువే. అందులోనూ పర్బని జిల్లాలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ జిల్లాకు నాసిక్‌ జిల్లా మన్మాడ్‌ నుంచి చమురు రావాల్సి ఉంటుంది. సుమారు 340 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రాంతం. రవాణా వ్యయం అధికమవ్వడంతో లీటర్‌కు 21 పైసలు ఇక్కడ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి..
ఆరో రోజూ పెట్రో ధరలు పైపైకే..
సూచీల పరుగులు అందుకే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని