Money Transfer: ఐఎంపీఎస్ నగదు బదిలీ లిమిట్ పెంచిన ఎస్బీఐ
ఐఎంపీఎస్ ద్వారా ఫిబ్రవరి 1 నుంచి రూ. 5 లక్షల వరకు బదిలీ చేయవచ్చు.
భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. బ్యాంకు శాఖల వద్ద చేసే ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) నగదు బదిలీ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఐఎంపీఎస్ లావాదేవీలకు సరికొత్త స్లాబ్ను ఏర్పాటు చేసింది. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య చేసే నగదు బదిలీలు కొత్త స్లాబ్ కిందకి వస్తాయి. వీటికి రూ. 20+జీఎస్టీ ఛార్జ్ వర్తించనుంది. కొత్త రూల్స్ ఫిబ్రవరి 1, 2022 నుంచి అమలులోకి రానున్నాయి.
ఎస్బీఐ: ఐఎంపీఎస్ బదిలీలు - వర్తించే ఛార్జీలు..
ఐఎంపీఎస్ అంటే..
ఐఎంపీఎస్ అంటే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్(తక్షణ నగదు బదిలీల చెల్లింపు వ్యవస్థ). నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసిఐ) నిర్వహిస్తుంది. ఈ విధానం ద్వారా వ్యక్తులు దేశీయంగా క్షణాల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎమ్, ఎస్ఎమ్ఎస్ వంటి వివిధ ఛానాళ్ల ద్వారా బ్యాంకులు, ఆర్బీఐ అధీకృత పీపీఐ(ప్రీపెయిడ్ పేమెంట్ ఇస్ట్రుమెంట్స్)ల్లో ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీసులను సెలవు రోజుల్లోనూ 24/7 యాక్సిస్ చేయవచ్చు. ప్రస్తుతం ఐఎంపీఎస్లో బ్యాంకులు, పీపీఐతో సహా మొత్తంగా 639 సభ్యులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం