Crime news: యువతిపై అత్యాచారం చేసి.. 10వ అంతస్తు నుంచి కిందకు తోసేసి!
మహిళలపై లైంగిక అకృత్యాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అతివలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా మరో పాశవిక ఘటన ....
కాన్పూర్: మహిళలపై లైంగిక అకృత్యాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అతివలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా మరో పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. 19ఏళ్ల యువతిని రేప్ చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడో మానవమృగం. తన వద్ద ఉద్యోగం చేస్తున్న యువతిని లైంగికంగా లొంగదీసుకొనేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ప్రణాళిక ప్రకారం తన ఫ్లాట్కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ.. చివరకు నేరం అంగీకరించాడని పోలీసుల వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రతీక్ వైశ్ (40) అనే వ్యక్తి డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద బాధిత యువతి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమెపై కన్నేసిన ప్రతీక్.. మంగళవారం పని ఉందని చెప్పి బాధితురాలిని కల్యాణ్పూర్లోని తన ఫ్లాట్కు తీసుకెళ్లాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. డబ్బు ఇస్తానని కూడా ఆశచూపాడు.. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీబీజీటీఎస్ మూర్తి వివరించారు. ఈ దారుణం గురించి పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించడంతో నిందితుడు పదో అంతస్తులో తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు తోసేయడంతో మృతిచెందిందని పోలీసులు తెలిపారు. నిందితుడుని బుధవారం అరెస్టు చేసి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి కస్టడీకి తరలించినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అబ్బాయిలతో ఫోను మాట్లాడొద్దని మందలించినందుకు.. అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు