China: ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 27మంది దుర్మరణం

చైనా(China)లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని గుయియాంగ్‌....

Published : 18 Sep 2022 14:57 IST

బీజింగ్‌: చైనా(China)లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో హైవేపై బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 27మంది దుర్మరణం చెందగా.. మరో 20మంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ప్రయాణికులు ఉన్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద ప్రమాదమని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని