అఫ్గాన్‌లో బాంబు దాడి: 31మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. గజ్నీ నగరంలో జరిగిన ఈ దాడిలో ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడి ఘటనను తూర్పు ప్రావిన్స్‌ గవర్నర్‌ వహీదుల్లా జుమాజదా ధ్రువీకరించారు.

Updated : 30 Nov 2020 16:36 IST

గజ్నీ: అఫ్గానిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. గజ్నీ నగరంలో జరిగిన ఈ దాడిలో ఘటనలో 31 మంది మృతి చెందారు. మరో 24 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడి ఘటనను తూర్పు ప్రావిన్స్‌ గవర్నర్‌ వహీదుల్లా జుమాజదా ధ్రువీకరించారు. అఫ్గాన్‌ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గజనీ నగరంలోని ఓ ప్రజా రక్షణ విభాగానికి సమీపంలో భారీగా పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 31 మంది మరణించగా.. మరో 24 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. హామ్వీ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలతో వచ్చి పేలుళ్లకు పాల్పడినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని