పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది.
విజయవాడకు వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
బావ, బావమరిది కుటుంబాల్లోని పది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత
తీవ్రగాయాల పాలైన మరో మహిళ
కోదాడ, న్యూస్టుడే: బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. రెండు కుటుంబాల్లోని ఓ మహిళ మినహా పెద్దలంతా మృత్యువు పాలవడం, ఆ మహిళ కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆరేళ్లు కూడా నిండని ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. కోదాడలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదమిది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్ వృత్తి రీత్యా డ్రైవర్. భార్య ఇద్దరు కుమార్తెలతో హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన ఆయన బావమరిది నలమల కృష్ణంరాజు కుటుంబం, అత్తామామలు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. శ్రీకాంత్ చిన్న కుమార్తె లావణ్య పుట్టెంట్రుకల వేడుకలు విజయవాడలోని గుణదల చర్చిలో నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇరు కుటుంబాలకు చెందిన పది మంది కారులో బయల్దేరాయి. కోదాడ పట్టణ పరిధి శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారి వెంట ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి ఢీకొంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం మొత్తం లారీ వెనక భాగంలో ఇరుక్కుపోయింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్(32)తో పాటు ఆయన పెద్ద కుమార్తె లాస్య(4), ఆయన బావమరిది నలమల కృష్ణంరాజు(26), ఆయన భార్య స్వర్ణకుమారి(23), అత్తామామలు నలమల మాణిక్యమ్మ(45), చందర్రావు(50)లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ భార్య నాగమణిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని వైద్యశాలకు తరలించారు.
కృష్ణంరాజు కుమారులు కౌశిక్, కార్తిక్ స్వల్ప గాయాలతో కోదాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాంత్ చిన్న కుమార్తె లావణ్యకు మాత్రమే ఎలాంటి గాయాలు కాలేదని, ఘటన స్థలాన్ని పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ‘ప్రమాద సమయంలో కృష్ణంరాజు కారు నడుపుతున్నారు. అతి వేగమే దుర్ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించాం. నిర్లక్ష్యంగా రహదారి వెంట లారీ నిలిపిన డ్రైవర్ కృష్ణారెడ్డిపైనా కేసు నమోదు చేశాం’ అని ఎస్పీ వెల్లడించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: సీఎం
ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోటాలో చోటుచేసుకుంది. -
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ‘ఆఫ్టర్ 9’ పబ్పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. -
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న