సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్‌లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Published : 26 Apr 2024 04:16 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు ఆయుధాలు విక్రయించిన ఇద్దరు వ్యక్తులను  పంజాబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సుభాష్‌ చందేర్‌ (37), అంజు తపన్‌ (32)గా ప్రకటించారు. మార్చి 15న ముంబయి సమీపంలోని పన్వేల్‌లో వీరిద్దరు రెండు తుపాకులు, 38 బుల్లెట్లను ఇప్పటికే అరెస్టయిన విక్కీ గుప్తా(24), సాగర్‌ పాల్‌(21)లకు విక్రయించారని తెలిపారు. మరోవైపు ఈ కేసుపై గురువారం ముంబయి కోర్టు విచారణ చేపట్టింది. విక్కీ గుప్తా, సాగర్‌లకు ఈ నెల 29 వరకు కస్టడీ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని