రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం

కుమురం భీం, నిజామాబాద్‌ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు.

Published : 26 Apr 2024 04:24 IST

కుమురం భీం, నిజామాబాద్‌ జిల్లాల్లో ఘటనలు

బెజ్జూరు, నిజామాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: కుమురం భీం, నిజామాబాద్‌ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బెజ్జూరు మండలం ఆర్కగూడకు చెందిన ఆత్రం మహేశ్‌(25), బారేగూడకు చెందిన తొర్రెం వెంగళ్‌రావు(30)లు బూర్గుగూడలో బంధువుల శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తున్నారు. ఎల్కపల్లికి చెందిన దున్న నర్సింహ(20), ఆయిళ్ల నిఖిల్‌, శనిగారం రాజ్‌కుమార్‌లు బారేగూడ వైపు వివాహ విందుకు వెళ్తున్నారు. వీరి ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మహేశ్‌, వెంగల్‌రావు, నర్సింహ అక్కడికక్కడే మృతిచెందగా నిఖిల్‌, రాజ్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

15 మందికి గాయాలు

నిజామాబాద్‌ గ్రామీణ మండలం కొత్తపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి.. వర్ని మండలం బడాపహాడ్‌కు 30 మందికి పైగా భక్తులతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడింది. ఈ ఘటనలో క్యాబిన్‌లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, ఆసుపత్రిలో ఓ మహిళ మరణించారు. మొత్తం 15 మంది క్షతగాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా కమ్మర్‌పల్లి మండలానికి చెందిన వారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని