విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

పొలంలో తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.

Published : 26 Apr 2024 04:25 IST

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పొలంలో తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పపన్నపేటకు చెందిన నలువాల నర్సయ్య (58) పొలాస గ్రామ శివారులో ఎకరం పది గుంటలు కౌలుకు తీసుకొని వరి సాగు చేపట్టారు. పంట పరిశీలనకు వెళ్లిన సమయంలో విద్యుత్‌ లైన్‌ నుంచి తెగిపడి ఉన్న వైరును గమనించకుండా దానిపై అడుగు వేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై పొలంలోనే దుర్మరణం పాలయ్యారు. నర్సయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల రూరల్‌ ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు