కూకట్పల్లిలో కారు బీభత్సం
నగరంలోని కూకట్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. సౌత్ ఇండియా షాపింగ్మాల్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
నాలుగు వాహనాలు ధ్వంసం
మూసాపేట: హైదరాబాద్లోని కూకట్పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం భయానక వాతవరణాన్ని తలపించే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు మెట్రో పిల్లర్ల పొడవునా దారంతా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉన్నఫలంగా జరిగిన ఈ ఘటనతో అటుగా వెళ్తున్న వారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఓ వ్యాపారవేత్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్న కాలే అశోక్ (40) అనే వ్యక్తి మధ్యాహ్న భోజనం ముగించుకున్న అనంతరం తన ద్విచక్ర మోటారు వాహనంపై తిరిగి తన కార్యాలయానికి బయలుదేరారు. కేపీహెచ్బీకాలనీ మెట్రో స్టేషన్ దాటగానే.. పిల్లరు నంబరు 757 వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు (టీఎస్07జీఈ 6999) ఇతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిపడిన ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అనంతరం అదే వేగంతో దూసుకెళ్లి బంజారాహిల్స్ నివాసి అయిన విజయ్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టంతో అతను సైతం ఎగిరి కిందపడ్డాడు. అదే సమయంలో దారిన నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని పక్క నుంచి ఢీకొట్టడంతో కిందపడిన అతను స్వల్ప గాయాలతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. కారు అంతటితో ఆగకుండా ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో అది కూడా బోల్తా పడింది. ఆ సమయంలో అందులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఆటో యజమాని కాళ్లకు గాయాలయ్యాయి.
ఇదే కారు పటాన్చెరు నుంచి నాంపల్లి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్రెడ్డి కారును సైతం వెనుక నుంచి ఢీకొట్టింది. చివరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీకొట్టి నిలిచిపోయింది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న పిల్లరు నంబరు 757 వద్ద మొదలైన ఈ బీభత్సం.. కూకట్పల్లి మార్గంలోని సౌత్ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న 763 పిల్లరు వద్ద ముగిసింది. అయితే ప్రమాదానికి కారణమైన కారులో యజమాని కొండయ్య కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో శ్రీనివాస్ అనే డ్రైవరు దాన్ని నడుపుతూ ఈ బీభత్సానికి పాల్పడ్డాడు. వరుసగా పలు వాహనాలను ఢీకొట్టడంతో సదరు కారు ముందు భాగం ధ్వంసమైది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు సదరు డ్రైవర్కు పరీక్షలు నిర్వహించి అతడు మద్యం మత్తు లేనట్లు నిర్ధారించారు. అయితే మొదటగా అశోక్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినపుడు అతను గాల్లోకి ఎగిరిపడటంతో దానికి డ్రైవర్ భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటపడాలనే కంగారుతో కారును మరింత వేగంగా నడపటంతోనే ఈ బీభత్సం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడు అశోక్కు భార్య లావణ్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
మైనర్ బాలికతో తనకు జరిగే నిశ్చితార్థాన్ని అధికారులు ఆపారనే క్షణికావేశంలో ఓ యువకుడు ఆ బాలిక తల నరికి హత్య చేశాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్