రోడ్లు శుభ్రపర్చమని పోలీసుకు షాకిచ్చిన కోర్టు!
కర్ణాటకలోని కలబురగి హైకోర్టు ఇటీవల ఓ పోలీసు అధికారికి షాకిచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో బజార్ పీఎస్ స్టేషన్ అధికారి విఫలమైనందున.. ఆయనను వారం రోజుల పాటు రోడ్లు శుభ్రం చేయాలని ఆదేశించింది.
బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి హైకోర్టు బెంచ్ ఇటీవల ఓ పోలీసు అధికారికి షాకిచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పీఎస్ స్టేషన్ అధికారి నిర్లక్ష్యం ప్రదర్శించినందున.. ఆయనను వారం రోజుల పాటు రోడ్లు శుభ్రం చేయాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. కలబురగి తాలుకా, మినజ్గి తండాకు చెందిన తారాబాయి(55) అనే మహిళ కుమారుడు సురేష్ అక్టోబర్ 20న అదృశ్యమయ్యాడు. దీంతో ఆమె తన కుమారుడి జాడ వెతికి పెట్టాలంటూ బజార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్ది రోజులకు తన కుమారుడిని వెతికిపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సురేష్ను నవంబర్ 3న వెతికి పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ క్రమంలో జస్టిస్ ఎస్ సునీల్దత్త యాదవ్, జస్టిస్ పీ రామకృష్ణ భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును మరోసారి పూర్తిగా పరిశీలించింది. బాధితురాలు ఫిర్యాదు చేసినపుడు ఆమె ఫిర్యాదుపై పోలీసులు తొలుత కనీసం స్టేషన్ డైరీలో గానీ, ఎఫ్ఐఆర్ నమోదు గానీ చేయకపోవడంపై సీరియస్గా పరిగణించింది. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైన స్టేషన్ హౌజ్ అధికారిని వారం రోజుల పాటు పోలీసుస్టేషన్ ముందు రోడ్లు శుభ్రపరచవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పోలీస్స్టేషన్లలో ఇలాంటి చర్యల విషయంలో కాస్త దృష్టి సారించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేసింది. అదేవిధంగా జీరో ఎఫ్ఐఆర్ అంశంపై జిల్లా పోలీసు అధికారులకు వర్క్షాప్ నిర్వహించాలని ఎస్పీకి సూచనలు చేసింది.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై ఎస్హెచ్వో స్పందిస్తూ.. ‘కోర్టు ఆదేశానుసారం.. స్టేషన్ ముందు రోడ్లు శుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరోసారి ఈ విధంగా వ్యవహరించనని కోర్టుకు విన్నవిస్తున్నా’ అని తెలిపారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!