కుమార్తెల ముందే జర్నలిస్ట్పై కాల్పులు
ఓ జర్నలిస్టుపై పలువురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఇద్దరు కూతుర్ల ఎదుటే..
సీసీ పుటేజీల్లో రికార్డయిన దృశ్యాలు
ఘజియాబాద్: ఓ జర్నలిస్టుపై పలువురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆయన ఇద్దరు కూమార్తెల ఎదుటే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీ సమీపంలోని ఘజియాబాద్లోని విజయనగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ టీవీ పుటేజీల్లో రికార్డయ్యాయి. జర్నలిస్టు విక్రమ్ జోషి ఇద్దరు కూతుర్లతో ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. కాగా ఓ ముఠా వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించి జోషిపై దాడికి పాల్పడి కాల్పులు జరిపారు. ప్రస్తుతం జోషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు బైకును అడ్డగించి తండ్రీ కూతుళ్లు కిందపడ్డాక జోషిపై దాడికి పాల్పడ్డారు. దీంతో జర్నలిస్టు కుమార్తెలు ఇద్దరు అక్కడినుంచి పరిగెత్తారు. దాడి అనంతరం పెద్ద కుమార్తె అక్కడికి వచ్చి ఏడవడం, సహాయం కోసం అర్థించడం సీసీ పుటేజీల్లో రికార్డయ్యింది. పలువురు స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
ప్రధాన నిందితుడు సహా దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా జర్నలిస్టుకు తెలిసినవారే అని పేర్కొన్నారు. తన మేనకోడలును ఓ ముఠా వేధింపులకు గురిచేస్తోందంటూ జోషి ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
-
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
-
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
-
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం