logo

కాంగ్రెస్‌ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం

Updated : 10 May 2024 08:15 IST

కీర్తీబాయి(పాత చిత్రం)

మహాముత్తారం, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం చోటుచేసుకోగా మహిళా కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు దుర్మరణం పాలైన ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. యామన్‌పల్లిలో సాయంత్రం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మహాముత్తారం మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి(45) ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం అటవీ గ్రామమైన పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్త స్తంభంపల్లి(పి.పి) గ్రామ తాజా మాజీ సర్పంచి జాడి రాజయ్యతో కలిసి కారులో బయల్దేరారు. నిమ్మగూడెం సమీపంలోని మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి మట్టి కుప్పను బలంగా ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం నడుపుతున్న రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు గమనించి ఇరువురిని బయటికి తీశారు. చికిత్స నిమిత్తం రాజయ్యను ఆసుపత్రికి తరలించారు. మహాముత్తారం ఎస్సై మహేందర్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కీర్తిబాయి 15 ఏళ్లుగా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని