ట్రెజరీ ఉద్యోగి ఇంట్లో భారీగా బంగారం,వెండి స్వాధీనం

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎస్సీ కాలనీలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ ఇంట్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. డీఎస్పీ రాఘవరెడ్డి నేతృత్వంలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో ఆయుధాలు, బంగారం, వెండి నిల్వలు..

Published : 19 Aug 2020 01:42 IST

బుక్కరాయ సముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎస్సీ కాలనీలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ ఇంట్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. డీఎస్పీ రాఘవరెడ్డి నేతృత్వంలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో ఆయుధాలు, బంగారం, వెండి నిల్వలు ఉంచారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. మనోజ్‌ ఇంట్లో ఉన్న 8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో పెట్టెను తెరిచి వాటిని లెక్కిస్తున్నారు. ఇవన్నీ ట్రెజరీలో పని చేసే మనోజ్‌కు చెందిన వస్తువులుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని