Crime News: కుమార్తెను చంపి.. బైక్కు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లి..!
Crime News: కన్న కుమార్తెను అత్యంత దారుణంగా చంపేశాడో తండ్రి. ఆమె మృతి వెనక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
అమృత్సర్: అనుమానంతో ఓ వ్యక్తి కన్నకూతురును అత్యంత కిరాతకంగా చంపేశాడు. ద్విచక్రవాహనానికి ఆమె మృతదేహాన్ని కట్టి, ఊరంతా ఈడ్చుకెళ్లాడు. పంజాబ్(Punjab)లోని అమృత్సర్(Amritsar) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. (Punjab horror)
నిందితుడు దల్బీర్ సింగ్ ఒక కూలీ. బుధవారం అతడి 20 ఏళ్ల కుమార్తె ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఈ క్రమంలో దల్బీర్ ఆమెపై అనుమానపడ్డాడు. ఎవరితోనో సంబంధం ఉందని ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపంతోనే ఆమెపై దాడిచేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మృతదేహాన్ని తన ద్విచక్రవాహనానికి కట్టి ఈడ్చుకెళ్లాడు. అనంతరం దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు.
తన ప్రేమకు అడ్డురాకూడదని.. తండ్రి కాళ్లు విరగొట్టించిన కుమార్తె
కుమార్తెపై దాడి చేస్తున్న సమయంలో దల్బీర్ను అడ్డుకునేందుకు ప్రయత్నించామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ నిందితుడు వారిని ఒక గదిలో బంధించి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దల్బీర్ను అరెస్టు చేశారు. ఆమె మృతి వెనక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఓ వ్యక్తి మైనర్ను బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది. -
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!