Crime News: కుమార్తెను చంపి.. బైక్‌కు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లి..!

Crime News: కన్న కుమార్తెను అత్యంత దారుణంగా చంపేశాడో తండ్రి. ఆమె మృతి వెనక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Updated : 11 Aug 2023 13:49 IST

అమృత్‌సర్‌: అనుమానంతో ఓ వ్యక్తి కన్నకూతురును అత్యంత కిరాతకంగా చంపేశాడు. ద్విచక్రవాహనానికి ఆమె మృతదేహాన్ని కట్టి, ఊరంతా ఈడ్చుకెళ్లాడు. పంజాబ్‌(Punjab)లోని అమృత్‌సర్(Amritsar) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. (Punjab horror)

నిందితుడు దల్బీర్ సింగ్‌ ఒక కూలీ. బుధవారం అతడి 20 ఏళ్ల కుమార్తె ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఈ క్రమంలో దల్బీర్ ఆమెపై అనుమానపడ్డాడు. ఎవరితోనో సంబంధం ఉందని ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపంతోనే ఆమెపై దాడిచేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మృతదేహాన్ని తన ద్విచక్రవాహనానికి కట్టి ఈడ్చుకెళ్లాడు. అనంతరం దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు. 

తన ప్రేమకు అడ్డురాకూడదని.. తండ్రి కాళ్లు విరగొట్టించిన కుమార్తె

కుమార్తెపై దాడి చేస్తున్న సమయంలో దల్బీర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ నిందితుడు వారిని ఒక గదిలో బంధించి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దల్బీర్‌ను అరెస్టు చేశారు. ఆమె మృతి వెనక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని