Crime News: అప్పుడే చంపేసేవాడు.. కానీ ఆమె ఏడుపే ఆపింది..!
మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్, శ్రద్ధాలు మూడేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పదేపదే ఒత్తిడి తేవడంతో అఫ్తాబ్ ఆమెను మే 18న గొంతుకోసి చంపాడు. విచారణలో భాగంగా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు అఫ్తాబ్(28) అసలు ఆమెను ఓ పదిరోజుల ముందే అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడట. కానీ, శ్రద్ధా రోదించడంతో ఆ రోజుకు ఆమె హత్య పథకం ఆగిపోయిందని పోలీసులు వర్గాలు వెల్లడించాయి.
మే 18 శ్రద్ధాను అఫ్తాబ్ హత్య చేశాడు. కానీ, దానికి పది రోజుల ముందు కూడా ఒకసారి వారిమధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ రోజే అఫ్తాబ్ ఆమెను అంతం చేయాలని భావించాడని ఆ వర్గాలు తెలిపాయి. ఆ గొడవ జరుగుతున్నప్పుడే శ్రద్ధా తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఒక దశలో ఆమె కన్నీటి పర్యంతమైంది. అది చూసి అఫ్తాబ్ కాస్త సంకోచించాడు. హత్య చేసేందుకు వెనకడుగు వేశాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.
ఇద్దరి మధ్య పెళ్లి గురించి తరచూ గొడవ జరిగేది. అఫ్తాబ్ వేరే అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడుతున్నాడని శ్రద్ధా అనుమానించేది. తనను మోసం చేస్తున్నాడని ఆమె భావించడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకునేదని విచారణలో తెలిసింది. ఇదిలా ఉంటే.. విచారణ సమయంలో నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని ఓ అధికారి వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్, శ్రద్ధాలు మూడేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో అఫ్తాబ్ ఆమెను మే 18న గొంతుకోసి చంపాడు. ఆపై శవాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్లో దాచాడు. 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్లో ఉండగానే.. అఫ్తాబ్ ఆన్లైన్ డేటింగ్ యాప్లో మరో యువతికి వలవేసి, ఆమెను పలుమార్లు తన అపార్ట్మెంట్కు రప్పించుకున్నాడని వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీఎఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!