తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్‌ను, సిమెంట్‌ ట్రైలర్‌ వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు.

Updated : 13 Dec 2020 04:46 IST

చెన్నై: తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్‌ను, సిమెంట్‌ ట్రైలర్‌ వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి - సేలం రహదారిపై తోప్పుర్ వద్ద సిమెంట్ ట్రైలర్ వాహనం, కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనక వేగంగా వస్తున్న 8 వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి  ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో పది మంది తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పలు కార్లు ధ్వంసమైనట్లు వారు వెల్లడించారు. 

ఇదీ చదవండి.. 22 సార్లు కత్తితో పొడిచి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని