Andhra News: భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య!

ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు అప్పారావు ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 04 May 2022 16:46 IST

దెందులూరు: ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు మడిపల్లి అప్పారావు(38) ఆత్మహత్య చేసుకున్నాడు. గొలుసు చోరీ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఆయన.. బుధవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూరప్పగూడేనికి చెందిన అప్పారావును మూడు రోజుల క్రితం పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌ బాత్‌రూమ్‌లో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పారావు మృతిపై అనుమానాలున్నట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని