Hyderabad: శామీర్పేట్ కాల్పుల ఘటన.. నటుడు మనోజ్కు రిమాండ్
మేడ్చల్ జిల్లా శామీర్పేట్ కాల్పుల కేసులో నటుడు మనోజ్ను పోలీసులు రిమాండ్కు తరలించారు.
శామీర్పేట్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్ కాల్పుల కేసులో నటుడు మనోజ్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం నిందితుడిని అల్వాల్లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు.. ఆయన ఆదేశాల మేరకు రిమాండ్లోకి తీసుకున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మనోజ్పై కేసు నమోదు చేశారు. శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్లో కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. నగరానికి చెందిన సిద్ధార్థదాస్పై మనోజ్కుమార్ ఎయిర్గన్తో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన సిద్ధార్థ అక్కడి నుంచి తప్పించుకుని శామీర్పేట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
సిద్ధార్థదాస్.. భార్య స్మితతో 2019లో విడిపోయాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్పేట్లోని విల్లా నంబరు 21లో మనోజ్కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ రోజు సిద్ధార్థ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో స్మితతో గొడవపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మనోజ్ కుమార్ ఆగ్రహానికి గురై ఎయిర్గన్తో సిద్ధార్థపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన అతడు అక్కడి నుంచి తప్పించుకుని శామీర్పేట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట.. ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.