Hyderabad: శామీర్‌పేట్‌ కాల్పుల ఘటన.. నటుడు మనోజ్‌కు రిమాండ్‌

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ కాల్పుల కేసులో నటుడు మనోజ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated : 16 Jul 2023 15:55 IST

శామీర్‌పేట్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ కాల్పుల కేసులో నటుడు మనోజ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం నిందితుడిని అల్వాల్‌లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు.. ఆయన ఆదేశాల మేరకు రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద మనోజ్‌పై కేసు నమోదు చేశారు. శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. నగరానికి చెందిన సిద్ధార్థదాస్‌పై మనోజ్‌కుమార్‌ ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన సిద్ధార్థ అక్కడి నుంచి తప్పించుకుని శామీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

సిద్ధార్థదాస్‌.. భార్య స్మితతో 2019లో విడిపోయాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్‌పేట్‌లోని విల్లా నంబరు 21లో మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ రోజు సిద్ధార్థ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో స్మితతో గొడవపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మనోజ్‌ కుమార్‌ ఆగ్రహానికి గురై ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన అతడు అక్కడి నుంచి తప్పించుకుని శామీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని