Crime news: ఇన్‌స్టా రీల్స్‌ చేయొద్దన్నాడని.. భర్తను హత్యచేసిన భార్య

ఇన్‌స్టా రీల్స్‌ చేస్తుంటే వద్దన్నాడన్న కోపంతో రాణికుమారి అనే మహిళ తన భర్తను హత్య చేసింది.

Published : 09 Jan 2024 18:01 IST

పట్నా: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ (Instagram Reels) చేయనివ్వడం లేదని కక్ష పెంచుకున్న భార్య తన భర్తను పక్కా ప్రణాళికతో హత్య చేసింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కలిసి గొంతుకోసి చంపేసింది. ఈ ఘటన బిహార్‌లోని (Bihar) బెగుసరాయ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేశ్వర్‌ కుమార్‌ రాయ్‌ (25), రాణి కుమారి భార్యాభర్తలు. అతడు కోల్‌కతాలో దినసరి కూలీగా పని చేసేవాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. భార్య సోషల్‌ మీడియా రీల్స్‌ చేయడం అతడికి నచ్చలేదు. వద్దని వారించడంతో, వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పథకం ప్రకారం భర్తను ఆమె పుట్టింటికి తీసుకెళ్లిన రాణి.. తన ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కలిసి హత్య చేసింది. కొద్దిసేపటి తర్వాత మృతుడి సోదరుడు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చి తండ్రిని పంపించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని