Crime news: ఇన్స్టా రీల్స్ చేయొద్దన్నాడని.. భర్తను హత్యచేసిన భార్య
ఇన్స్టా రీల్స్ చేస్తుంటే వద్దన్నాడన్న కోపంతో రాణికుమారి అనే మహిళ తన భర్తను హత్య చేసింది.
పట్నా: ఇన్స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) చేయనివ్వడం లేదని కక్ష పెంచుకున్న భార్య తన భర్తను పక్కా ప్రణాళికతో హత్య చేసింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కలిసి గొంతుకోసి చంపేసింది. ఈ ఘటన బిహార్లోని (Bihar) బెగుసరాయ్లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేశ్వర్ కుమార్ రాయ్ (25), రాణి కుమారి భార్యాభర్తలు. అతడు కోల్కతాలో దినసరి కూలీగా పని చేసేవాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. భార్య సోషల్ మీడియా రీల్స్ చేయడం అతడికి నచ్చలేదు. వద్దని వారించడంతో, వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పథకం ప్రకారం భర్తను ఆమె పుట్టింటికి తీసుకెళ్లిన రాణి.. తన ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కలిసి హత్య చేసింది. కొద్దిసేపటి తర్వాత మృతుడి సోదరుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చి తండ్రిని పంపించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.