బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారులను వెంబడించి.. వేట కొడవళ్లతో దాడి

శ్రీ సత్యసాయి జిల్లాలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తల్లీ కుమారులపై కొంతమంది దుండగులు దాడి చేశారు.

Updated : 27 Oct 2023 12:54 IST

అగలి: శ్రీ సత్యసాయి జిల్లాలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తల్లీ కుమారులపై కొంతమంది దుండగులు దాడి చేశారు. అగలి మండటం పి.బ్యాడిగెర సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట కారులో వచ్చిన దుండగులు కొడికొండ - సిరా జాతీయ రహదారిపై తల్లి మంగళమ్మ, కుమారుడు మారుతి కోసం కాపు కాశారు. ఇది గమనించిన ఇద్దరూ.. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు కారులో వెంబడించి వేట కొడవళ్లతో వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ఉల్లేకెర గ్రామ సమీపం వరకు సుమారు కిలోమీటర్‌ మేర తల్లీకుమారులను వెంబడించారు. అనంతరం వారిని వదిలేశారు. అక్కడనుంచి తప్పించుకున్న బాధితులు స్థానిక ఎస్సై లావణ్యకు సమాచారమిచ్చారు. పోలీసు సిబ్బంది ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని.. వారిని సిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు