Eluru: ప్రైవేటు కళాశాల బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు

ఏలూరు సమీపంలోని చోదిమెళ్ల వద్ద ఓ ప్రైవేటు కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.

Updated : 06 Nov 2023 20:04 IST

ఏలూరు నేర విభాగం: ఏలూరు సమీపంలోని చోదిమెళ్ల వద్ద ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. కళాశాల నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏలూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని