Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్లో భారీ చోరీ
ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్లో పట్ట పగలు దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్: ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్లో పట్ట పగలు దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకన్న పోలీసులు వారి నుంచి ఏడు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
‘‘ఈనెల 27వ తేదీ ఉదయం రద్దీగా ఉండే సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ జ్యూవెలర్స్కు ఆరుగురు నిందితులు వచ్చి ఐటీ అధికారులమంటూ సిబ్బందిని ఓ గదిలో బంధించారు. తనిఖీల పేరుతో కార్ఖానాలో ఉన్న 17 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఉడాయించారు. నిందితులు ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారింది. మొత్తం సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆభరణాల దుకాణంలో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దొంగలు నగరం చేరినట్లు అంచనాకు వచ్చారు. రంజాన్ తర్వాత ఖానాపూర్కు చెందిన జాకీర్ అనే వ్యక్తి పనిలో చేరాడు. అతడు ఇచ్చిన సమాచారంతో చోరీకి ఈ ముఠా ప్లాన్ చేసింది. జాకీర్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. మహారాష్ట్రలోని ఖానాపూర్ వెళ్లి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, 10 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల కోసం మహారాష్ట్రలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సూర్య నటించిన ' గ్యాంగ్ ' , అక్షయ్ కుమార్ నటించిన 'స్పెషల్ 26' సినిమాలు చూసి చోరికి పథకం వేసినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు’’ అని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
మైనర్ బాలికతో తనకు జరిగే నిశ్చితార్థాన్ని అధికారులు ఆపారనే క్షణికావేశంలో ఓ యువకుడు ఆ బాలిక తల నరికి హత్య చేశాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!