Plane: విమానంపై నుంచి పడి ఇంజినీర్‌ మృతి.. మరమ్మతు చేస్తుండగా ఘటన!

మరమ్మతు చేస్తూ విమానంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానంలో మరమ్మతులు చేస్తూ రామ్‌ప్రకాశ్‌ సింగ్‌ అనే ఇంజినీర్‌ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు.

Published : 08 Nov 2023 01:21 IST

దిల్లీ: మరమ్మతు చేస్తూ విమానంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దిల్లీ ఎయిర్‌పోర్ట్‌(Delhi Airport)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రామ్‌ప్రకాశ్‌ సింగ్‌(56) ఎయిర్‌ఇండియా (Air India) సంస్థలో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ఎయిర్‌పోర్ట్‌లోని టీ-3లో విధులకు హాజరయ్యారు. విమానం ముందుభాగం(రాడోమ్‌)లో మరమ్మతు చేస్తూ ప్రమాదవశాత్తూ విమానంపై నుంచి కిందపడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌ఇండియా సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని