Peddapalli: దారుణం.. కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంథని మండలం బత్తుపల్లిలో సదయ్య అనే వ్యక్తి తన కుమార్తె రజిత (10)ను గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు.

Updated : 11 May 2023 12:03 IST

మంథని: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంథని మండలం బత్తుపల్లిలో సదయ్య అనే వ్యక్తి తన కుమార్తె రజిత (10)ను గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుమార్తెను చంపేసిన తర్వాత గ్రామంలోని మరో వ్యక్తిపైనా సదయ్య దాడి చేశాడు. అయితే, గత కొంతకాలంగా ఆయన మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని