విజయవాడ శివారులో కాల్పుల కలకలం
విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించింది. అర్ధరాత్రి యువకుడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్రోడ్డులోని బార్ సమీపంలో చోటుచేసుకుంది.
విజయవాడ: నగర శివారులో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి యువకుడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మృతుడు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్రోడ్డులోని బార్ సమీపంలో చోటుచేసుకుంది. పథకం ప్రకారమే మహేష్ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి పరిశీలించారు.
పోలీసు కమిషనరేట్ ఉద్యోగి మహేశ్ హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నున్న శివారులోని ఓ దాబా వద్ద మహేశ్ తన స్నేహితులు ఐదుగురితో కలిసి మద్యం సేవిస్తుండగా... ఇద్దరు ఆగంతకులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. మహేశ్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లిడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఘటన అనంతరం బాధితుల కారులోనే పారిపోదామనుకున్న నిందితులు కొంత దూరం వెళ్లాక దాన్ని ముస్తాబాద్ రోడ్లో వదిలేశారు. ఘటనా స్థలంలో పడి ఉన్న మూడు బుల్లెట్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుశాఖకు చెందిన ఉద్యోగినే హతమార్చడం, స్తబ్దుగా ఉన్న గన్ కల్చర్ మళ్లీ తెరపైకి రావడంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. హత్యకు రియల్ ఎస్టేట్ కారణాలా? లేక కుటుంబ వివాదాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్టు సమాచారం. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ టీటీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం