పట్టుచీరల వ్యాపారంతో మోసం
తనకు పెద్ద పట్టువస్త్రాల షోరూమ్ ఉందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలుప్రాంతాల్లో వ్యాపారులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ ఒకటో పోలీస్స్టేషన్ సీఐ
ముద్దిరెడ్డిపల్లి(హిందూపురం అర్బన్): తనకు పెద్ద పట్టువస్త్రాల షోరూమ్ ఉందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలుప్రాంతాల్లో వ్యాపారులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ ఒకటో పోలీస్స్టేషన్ సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ శేఖర్ తెలిపారు. బుధవారం ఠాణాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ, ఎస్ఐ వెల్లడించిన వివరాల మేరకు... సికింద్రాబాద్లోని మౌలాలి, తిరుమలగిరి, హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన ఎ.కొండలరావ్ తనకు పెద్ద పట్టువస్త్రాల షోరూమ్ సికింద్రాబాద్లో ఉందని రాష్ట్రంలోని ధర్మవరం, ప్రొద్దుటూరు, ముద్దిరెడ్డిపల్లి, తమిళనాడులోని సేలం, వారణాసి, కోయంబత్తూరులోని పట్టువస్త్రాల వ్యాపారులను నమ్మించి వారి నుంచి లక్షలాది రుపాయల చీరలు తీసుకొని చెక్కులు ఇస్తూ వచ్చాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులేక వ్యాపారులు మోసపోయారని పోలీసులు తెలిపారు. 2018లో ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి రూ.25 లక్షల విలువ చేసే పట్టువస్త్రాలు కొని డబ్బు ఇవ్వకుండా ముఖం చాటేశాడన్నారు. బాధిత వ్యాపారులు స్థానిక ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ