రెండు నెలలుగా ఎయిర్పోర్టులోనే నేరస్థుడు!
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్లో విధించిన లాక్డౌన్ కారణంగా దిల్లీ విమానాశ్రయంలో ఓ అరుదైన సంఘటన జరిగింది.
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్లో విధించిన లాక్డౌన్ కారణంగా ఓ నేరస్థుడు దిల్లీ విమానాశ్రయంలోనే గడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనుకోకుండా ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి.. గత 50రోజులుగా విమానాశ్రయంలోనే గడుపుతున్నాడు. అతని పూర్తి వివరాలు సేకరించగా అతడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలింది.
జర్మనీకి చెందిన ఎడ్గార్డ్ జైబాట్ అనే 40ఏళ్ల వ్యక్తి మార్చి 18న వియాత్నం నుంచి భారత్ మీదుగా ఇస్తాంబుల్ బయలుదేరాడు. మార్గమధ్యంలో దిల్లీ విమానాశ్రయం చేరుకున్న సమయంలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో టర్కీకి రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అన్ని రకాల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయంలో చిక్కుకున్న కొందరి విదేశీ ప్రయాణికులకు వారి రాయబార కార్యాలయాలు తోడ్పాటునందించాయి. కానీ జర్మనీకి చెందిన జైబాట్ మాత్రం దిల్లీ విమానాశ్రయంలోనే ఉండిపోయాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది జర్మనీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా అతడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలింది. దాడులతో పాటు ఇతర నేరపూరిత కేసులు అతడిపై ఉన్నట్లు వెల్లడించింది. దీంతో జర్మనీ రాయబార కార్యాలయం అతడికి సహకరించకపోగా.. విదేశంలో ఉన్న కారణంగా అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు నిరాకరించింది.
విమానాశ్రయం నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి. కానీ అతనికున్న నేరచరిత్ర కారణంతో భారత్ కూడా వీసా ఇవ్వలేదు. దీంతో గత 50రోజులుగా దిల్లీ విమానాశ్రయంలోనే ఉండిపోయాడని అక్కడి సిబ్బంది వెల్లడించారు. టెర్మినల్లో ఉన్న ఫుడ్ కోర్టుల్లో ఆహారం తింటూ, అక్కడి సిబ్బందితో కాలక్షేపం చేస్తున్నాడు. అక్కడే కుర్చీలు, నేలపై నిద్రిస్తున్నాడు. అయితే, టెర్మినల్ లోపల ఉన్న అతని కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం టర్కీకి వెళ్లిన ప్రత్యేక విమానంలో పంపించేందుకు ప్రయత్నించినప్పటకీ అక్కడి అధికారులు నిరాకరించారు. ఆ విమానంలో కేవలం టర్కీ దేశీయులకు మాత్రమే అనుమతినిచ్చారు. అయితే, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే అతన్ని పంపించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం