భార్య.. ప్రియుడే హతమార్చారు

కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చిందని సీఐ సురేష్‌బాబు తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సమావేశం ఏర్పాటు చేసి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Published : 25 Sep 2020 07:31 IST

నిందితులను చూపుతున్న సీఐ సురేష్‌బాబు

కళ్యాణదుర్గం : కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చిందని సీఐ సురేష్‌బాబు తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సమావేశం ఏర్పాటు చేసి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈనెల 20వ తేదీ రాత్రి దొడగట్ట గ్రామంలో శ్రీనివాసులు (37) అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి మరణానికి కోడలు సరిత, ఆమె ప్రియుడు ప్రభాకరే కారణం అని శ్రీనివాసులు తండ్రి రామచంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సరిత, ప్రభాకర్ల మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోందని తెలిసింది. ఈ క్రమంలో ఈనెల 20న రాత్రి సరిత భర్త శ్రీనివాసులుతో గొడవపడింది. ఇంట్లో ఉన్న పప్పుగుత్తితో శ్రీనివాసులు తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావమై శ్రీనివాసులు మృతిచెందాడు. సరిత ప్రియుడు ప్రభాకర్‌తో కలిసి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు లుంగీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీరి కోసం రెండు బృందాలుగా ఏర్పడి గాలించగా గురువారం మాదిరెడ్డిపల్లి బస్టాండు దగ్గర ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని