Crime: నిశ్చితార్థానికి ముందురోజే మృత్యు ఒడికి
తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన యువతిని భవనం రెయిలింగ్ శకలాల రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యంతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు
భవనం రెయిలింగ్ శకలాలు పడి యువతి దుర్మరణం
మూసాపేట, కరణ్కోట (తాండూరు గ్రామీణ), న్యూస్టుడే: తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన యువతిని భవనం రెయిలింగ్ శకలాల రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యంతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగింది. కూకట్పల్లి పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట జయశంకర్ కాలనీకి చెందిన జెట్టూరి శేఖర్, సత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు రోజా, శ్వేత; కుమారుడు నవీన్ ఉన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో శేఖర్ ఒప్పంద కార్మికుడు. పెద్ద కుమార్తె రోజా(24) ఎమ్మెస్సీ చదివి ఫార్మసీ కోర్సు చేసింది. కూకట్పల్లిలోని అనన్య ఆసుపత్రి సమీపంలో అద్దెకు ఉంటూ ఉంటూ శామీర్పేటలోని లాల్గడి మలక్పేటలోని ఎస్.పి.అక్యూర్ ల్యాబ్ సంస్థలో పనిచేస్తోంది. వికారాబాద్లోని మిషన్ ఆసుపత్రి వైద్యుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. బుధవారం జరగాల్సిన నిశ్చితార్థం ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు మునిగిపోయాయి. నూతన వస్త్రాలు తీసుకొనేందుకు స్నేహితురాలు మౌనికతో కలిసి రోజా మంగళవారం రాత్రి 7.30 ప్రాంతంలో డిజైనర్ వద్దకు వెళ్లింది. ఆమె లేకపోవడంతో దుకాణం ముందు నిరీక్షిస్తుండగా భవనం మూడో అంతస్తు నుంచి పెద్ద రెయిలింగ్ శకలాలు ఆమె తలపై పడటంతో కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని బుధవారం సొంతూరికి తరలించారు. మంగళవారమే రావాల్సి ఉండగా, చీకటి పడడంతో బుధవారం తెల్లవారుజామున రావాలని తండ్రి సూచించారు. భవనం ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువుది. రెయిలింగ్కు పగుళ్లున్నాయని యజమాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
మైనర్ బాలికతో తనకు జరిగే నిశ్చితార్థాన్ని అధికారులు ఆపారనే క్షణికావేశంలో ఓ యువకుడు ఆ బాలిక తల నరికి హత్య చేశాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM