Crime News: బోరునీళ్లు తాగాడని వృద్ధుడి ప్రాణాలు తీశారు..

బిహార్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. వైశాలి జిల్లా సేలంపుర్‌ ప్రాంతంలో

Published : 09 Nov 2021 01:15 IST

బిహార్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. వైశాలి జిల్లా సేలంపుర్‌ ప్రాంతంలో తమ అనుమతి లేకుండా బోరునీళ్లు తాగాడని 70ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ‘‘మా నాన్న పశువులకు గడ్డి తెచ్చేందుకు వెళ్లాడు. దాహం వేసి నీటి కోసం బోరుపంపు వద్దకు వెళ్లాడు. తమ అనుమతి లేకుండా నీళ్లు తాగాడన్న కోపంతో దాని యజమానులు మా నాన్నను కొట్టారు. తర్వాత అతను మరణించాడు. వారితో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు’’ అని మృతుడి కుమారుడు రమేశ్‌ సైని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని