తుపాకీతో బెదిరించి.. ఇంట్లో దోపిడీ
ఘటనకు సంబంధించి ఎస్ఐ గిరి తెలిపిన వివరాలు.. జోగు ఆంజనే
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి
కుల్కచర్ల, న్యూస్టుడే: గుర్తుతెలియనని వ్యక్తులు తుపాకీతో బెదిరించి.. ఓ ఇంట్లో ఆభరనాలు, నగదు దోచుకుని వెళ్లిన సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ గిరి తెలిపిన వివరాలు.. జోగు ఆంజనేయులు, అలివేలు దంపతులు. కూతురులో కలిసి కొంతకాలంగా కాళమ్మగుడి సమీపంలోని పొలంలో ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే రాత్రి సుమారుగా 9.30 గంటల సమయంలో ఇంట్లో ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో ముఖాలకు మంకీక్యాప్లను ధరించిన నలుగురు ఇంట్లోకి ప్రవేశించారు. తుపాకీ ఎక్కుపెట్టి సెల్ఫోన్లు లాగేసుకున్నారు. అక్కడే ఉన్న ఆయన కూతురుకు కత్తి చూపి అరిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. అలివేలు మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగేసుకున్నారు. వారిలో ఒకరు నేరుగా బిరువా వద్దకు వెళ్లి అందులో దాచిన మరో రెండు తులాల బంగారాన్ని తీసుకున్నారు. కుటుంబ సభ్యులను ఇంట్లోనే ఉంచి తలుపులు మూసి బయట నుంచి గడియపెట్టేశారు. బాధితుల ఫోన్లను ఇంటి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు. ఆ తరవాత అర్ధరాత్రి ఎలాగోలా ఇంటి బయటకు వచ్చి మండల కేంద్రంలో ఉంటున్న వారి సోదరుడికి, పోలీసులకు సమాచారాన్ని అందించారు. రెండు నెలల క్రితం కూడా ఇదే ఇంటిలో గుర్తుతెలియని దొంగలు అల్మారాలో ఉంచిన రూ.50 వేల నగదును చోరీ చేశారు. దోపిడీ జరిగిన ఇంటిని, పరిసరాల్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి శనివారం పరిశీలించారు. చోరీ ఎలా జరిగింది? ఎంత మంది వచ్చారు? తదితర వివరాలపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే కేసును ఛేదిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!