Hyderabad: బల్లికి గురిపెట్టి బాలుణ్ని కాల్చాడు

తుపాకీ కాల్చాలన్న సరదాతో ఓ యువకుడు సోదరుడి ద్వారా ఎయిర్‌పిస్టల్‌ కొనుగోలు చేసి ఇంట్లో సాధన చేస్తుండగా గురితప్పి ఓ బాలుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.

Updated : 06 Aug 2022 06:37 IST

పాతబస్తీలో కాల్పుల కలకలం


అఫ్సర్‌

ఈనాడు, హైదరాబాద్‌; చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: తుపాకీ కాల్చాలన్న సరదాతో ఓ యువకుడు సోదరుడి ద్వారా ఎయిర్‌పిస్టల్‌ కొనుగోలు చేసి ఇంట్లో సాధన చేస్తుండగా గురితప్పి ఓ బాలుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. పాతబస్తీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం మొఘల్‌పురా సీఐ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌షాహీకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అఫ్సర్‌(30) వాటర్‌ప్లాంట్‌, పాన్‌దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 1న మధ్యాహ్నం ఎయిర్‌ పిస్టల్‌(0.177)తో గోడమీద బల్లులను కాల్చసాగాడు. ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్‌ గోడకు తగిలి చిన్న ముక్క(పెల్లెట్‌) వరండాలో ఆడుకుంటున్న పక్కింట్లోని బాలుడు(9) వీపునకు తగిలింది. గాయపడిన బాలుడికి స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపించి, బంజారాహిల్స్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. 3న బహదూర్‌పురలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను కోలుకుని శుక్రవారం ఇంటికెళ్లాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్సర్‌పై కేసు నమోదు చేశారు. అఫ్సర్‌ ఎయిర్‌ పిస్టల్‌తో వస్తువులను కాల్చటం సాధారణంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చికిత్స చేసిన ఆసుపత్రులు సైతం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు