Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్లో రూ.2 లక్షల చోరీ

తిరుమల లడ్డూ కౌంటర్లో రూ.2 లక్షల చోరీ జరిగింది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాస్‌ పవన్‌ కార్పొరేషన్‌ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెలక్రితం రాజా కిషోర్‌ కౌంటర్‌ బాయ్‌గా విధుల్లో చేరారు.

Updated : 25 Jan 2023 07:31 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ కౌంటర్లో రూ.2 లక్షల చోరీ జరిగింది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాస్‌ పవన్‌ కార్పొరేషన్‌ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెలక్రితం రాజా కిషోర్‌ కౌంటర్‌ బాయ్‌గా విధుల్లో చేరారు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు నిర్వహించారు. లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రూ.2 లక్షలను తనవద్దే ఉంచుకుని, గడియ పెట్టడం మరిచిపోయి కౌంటర్లోనే నిద్రపోయారు. ఉదయం నిద్రలేచి చూడగా నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాత నేరస్థుడైన సీతాపతిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్సుకు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని