Nagarkurnool: ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు

ఏటీఎం కేంద్రం నుంచి దుండగులు  ఏకంగా యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకొంది.

Updated : 04 Sep 2023 07:02 IST

పెద్దకొత్తపల్లి, న్యూస్‌టుడే: ఏటీఎం కేంద్రం నుంచి దుండగులు  ఏకంగా యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకొంది. నిర్వాహకుడు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రమైన పెద్దకొత్తపల్లిలో శనివారం రాత్రి వర్షం పడటంతో అర్ధరాత్రి వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు బస్టాండ్‌ చౌరస్తా సమీపంలోని ఇండియా 1 కంపెనీ నిర్వహిస్తున్న ఏటీఎంపై కన్నేశారు. మొదట సీసీ కెమెరాల తీగలను కత్తిరించి, రాడ్డుతో షట్టరును పైకి లేపి ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి ఏటీఎం కేంద్రాన్ని మూసి వెళ్లానని, ఆదివారం  తెరుద్దామని వచ్చేసరికి చోరీ ఘటన తెలిసిందని నిర్వాహకుడు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని