నిమజ్జనానికి ముందుగా వెళ్లారని దళితులపై దాడి.. వైకాపా నాయకుల ప్రోద్బలంతో..
దళితులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం నిమజ్జనానికి ముందుగా బయలుదేరడం వైకాపా నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
శ్రీసత్యసాయి జిల్లాలో 18 మందిపై కేసు
సోమందేపల్లి, న్యూస్టుడే: దళితులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం నిమజ్జనానికి ముందుగా బయలుదేరడం వైకాపా నాయకులకు ఆగ్రహం తెప్పించింది. దళితులపై యువకులను ఉసిగొల్పి తిట్టించారు. బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆగ్రహించిన నాయకులు యువతను రెచ్చగొట్టి దాడికి పంపారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి నలుగుర్ని గాయపరిచారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పంచాయతీ పరిధి చాకార్లపల్లిలో జరిగింది. దీంతో అధికార పార్టీ నాయకులు సహా 18 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. చాకార్లపల్లిలో బుధవారం నిమజ్జనానికి మొదట దళితులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని వాహనంలో తరలిస్తుండగా.. వైకాపా నాయకుల ప్రోద్బలంతో పలువురు యువకులు అడ్డుకొని దుర్భాషలాడటంతో బాధితులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఎస్ఐ తిరుమల బ్రహ్మోత్సవాల బందోబస్తులో ఉన్నారు. వైకాపా నాయకులు రెచ్చగొట్టడంతో బీసీ యువకులు, మహిళలు శుక్రవారం రాత్రి కర్రలతో దళితకాలనీలో తిరుగుతూ కులం పేరుతో అసభ్యంగా దూషిస్తూ శ్రీనివాసులు, సుజాత, తెదేపాకు చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామాంజనమ్మ, నరసింహులు దంపతులపై దాడి చేశారు. రాళ్లు విసిరి కాలనీవాసులను భయాందోళనకు గురిచేశారు. శనివారం రాత్రి గ్రామంలో సీఐ, ఎస్సైలు విచారణ జరిపి అధికార పార్టీ నాయకులైన సజ్జారెడ్డి, ఆర్సీ రెడ్డి, సురేశ్రెడ్డితో పాటు 11 మంది యువకులు, మరో నలుగురు మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశామని సీఐ కరుణాకర్, ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం