Hyderabad: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ శ్వేత దారుణహత్యకు గురైంది. భర్త అశోక్రాజ్ ఆమెను హతమార్చాడు.
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ శ్వేత దారుణహత్యకు గురైంది. భర్త అశోక్రాజ్ ఆమెను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. భార్యను చంపిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ హైదరాబాద్ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు.. అశోక్రాజే హతమార్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. -
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాలాల మండలం దౌలాపూర్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం