Jewellery Store: అందరూ చూస్తుండగానే.. బంగారు దుకాణం లూటీ!
బంగారు దుకాణంలోని సిబ్బందిని బెదిరించి.. ఐదుగురు దుండగలు మొత్తం నగలను ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని రాజపుర్ రోడ్లో చోటు చేసుకుంది.
దెహ్రాదూన్: పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఐదుగురు దుండగులు ఓ బంగారు దుకాణాన్ని లూటీ చేశారు. అక్కడి సిబ్బందిని తుపాకీలతో బెదిరించి మొత్తం నగలను ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని (Uttarakhand) దెహ్రాదూన్ (Dehradun) రిలయన్స్ జ్యూయలరీ స్టోర్లో గురువారం ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూడు రోజుల పర్యటకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, సాయుధ బలగాలు ఆమెకు భద్రత కల్పించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీనిని దుండగులు అవకాశంగా మలచుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక రాజాపుర్ రోడ్డులోని బంగారు దుకాణంలోకి.. గురువారం ఐదుగురు దుండగులు హఠాత్తుగా ప్రవేశించారు. వారిలో ఇద్దరి వద్ద గన్లు ఉన్నాయి. సిబ్బందిని పక్కకు తప్పుకోవాలని ఆదేశించడంతో వారిలో ఇద్దరు ముగ్గురు ప్రతిఘటించారు. వాళ్లను తాళ్లతో కట్టేసి.. మిగతావారిని బెదిరించారు. దుకాణంలోని సొత్తును మొత్తం బ్యాగుల్లో సర్దుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సిబ్బంది ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీకెమెరా దృశ్యాలను పరిశీలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.