Crime news: ముంబయి తాజ్ హోటల్ను పేల్చేస్తానని బెదిరించి.. అడ్డంగా దొరికిపోయాడు!
ముంబయిలోని (Mumbai) ప్రసిద్ధ తాజ్ హోటల్ను (Taj Hotel) పేల్చేస్తానని ఓ వ్యక్తి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశాడు. దాంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబయి: ముంబయి (Mumbai) అనగానే... గుర్తొచ్చే వాటిలో ఒకటి తాజ్ హోటల్ (Taj Hotel)! నవంబర్ 26, 2008న ఈ హోటల్పై ఉగ్రదాడి జరిగింది. అటువంటి చోట తాను బాంబు పెట్టానని ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. ఆ నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ధరమ్పాల్ సింగ్ అనే వ్యక్తి శనివారం ముంబయి ఫైర్ బ్రిగేడ్కు ఫోన్ చేశాడు. తాను ప్రసిద్ధ తాజ్ హోటల్ను పేల్చేయబోతున్నానని సమాచారం ఇచ్చాడు. దాంతో వెంటనే ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. గంటలపాటు తాజ్ హోటల్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. అనుమానాస్పదంగా ఏమీ కన్పించపోవడంతో ఫోన్ కాల్ గురించి ఆరా తీశారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
ఫైర్ బ్రిగేడ్కు ఫోన్ చేయడానికి ముందే నిందితుడు ధరమ్పాల్ పలుమార్లు ముంబయి పోలీసులకు ఫోన్ చేసినట్లు కనుగొన్నారు. దాంతో ముంబయిలోని కొలాబా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కూపీ లాగి ధరమ్పాల్ను అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ బాంబు బెదిరింపు పాల్పడటానికి గల కారణమేంటనే విషయంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు