Bank Robbery: బాంబుతో బెదిరించి.. బ్యాంకులో రూ.24 లక్షలు దోచేశాడు..!
ఓ ముసుగు దొంగ బ్యాంకులోకి ప్రవేశించి.. సిబ్బందిని బెదిరించి రూ.24 లక్షలతో పరారయ్యాడు. రాజస్థాన్లోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.
జైపుర్: పట్టపగలే బ్యాంకు దోపిడీ (Bank Robbery) జరిగింది. ముసుగు ధరించి బ్యాంకులోకి ప్రవేశించిన ఓ ఆగంతుకుడు.. వెంట తెచ్చుకున్న బాంబు పేల్చేస్తానంటూ సిబ్బందిని బెదిరించి రూ.24 లక్షలతో పరారయ్యాడు. రాజస్థాన్ (Rajasthan)లోని హర్సావా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాస్కు ధరించిన ఓ దుండగుడు గురువారం ఇక్కడి ఒక ప్రైవేటు బ్యాంకులోకి ప్రవేశించాడు. నగదు ముట్టజెప్పాలని.. లేనిపక్షంలో తన వద్ద ఉన్న బాంబు (Bomb)ను పేల్చేస్తానని సిబ్బందిని బెదిరించాడు.
దీంతో భయపడిపోయిన సిబ్బంది తొలుత రూ.1.25 లక్షలు ఇచ్చారు. అయితే.. నిందితుడు మరింత డబ్బు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే క్యాషియర్ గదిలోకి ప్రవేశించిన అతను మొత్తం రూ.24 లక్షల వరకు బ్యాగులో సర్దేశాడు. అనంతరం బ్యాంకు ప్రధాన గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన సమయంలో బ్యాంకు లోపల వినియోగదారులెవరూ లేరు. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకుతోపాటు పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!