ఏవోబీ: తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలు

ఏవోబీ సరిహద్దు వద్ద శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టు పాంగి దయగా గుర్తించారు. విశాఖపట్నం జిల్లా వాకపల్లికి చెందిన దయ.. గత ఆరేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్కన్‌గిరి

Published : 26 Jul 2020 17:10 IST

ఒక మావోయిస్టు మృతి

అమరావతి: ఏవోబీ సరిహద్దు వద్ద శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టు పాంగి దయగా గుర్తించారు. విశాఖపట్నం జిల్లా వాకపల్లికి చెందిన దయ.. గత ఆరేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలిలో మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 303 తుపాకి, పిస్తోల్‌, 3 కిట్‌ బ్యాగ్‌లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టు అగ్ర నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని