నడిరోడ్డుపై దారుణహత్య

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో పట్టపగలు నడిరోడ్డుపై థామస్ అనే యువకుడి హత్య జరిగిన విషయం తెలిసిందే.

Updated : 18 Dec 2020 20:46 IST

సీసీ కెమెరాలో దృశ్యాలు వెలుగులోకి

ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో పట్టపగలు నడిరోడ్డుపై థామస్ అనే యువకుడి హత్య జరిగిన విషయం తెలిసిందే. గాంధీ పార్క్ వద్ద జోసఫ్ అనే వ్యక్తి థామస్‌ను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

 జోసఫ్ భార్య, థామస్ ఒంగోలులోని ఓ షాపింగ్‌మాల్ లో పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య చిన్న గొడవ విషయమై జోసఫ్ యువకుడిపై పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మాట్లాడదామని యువకుడిని పిలిపించిన జోసఫ్‌.. భార్య అడ్డుకుంటున్నా ఆగకుండా పలుమార్లు థామస్‌ను కత్తితో పొడిచి చంపాడు. దాడి నుంచి తప్పించేందుకు థామస్‌ ప్రయత్నించినా ఆగకుండా వెంటపడి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హతమర్చాడు. దాడి ఘటన జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఓ వ్యక్తి నిందితుడిని నిలువరించేందుకు ప్రయత్నించినా అప్పటికే యువకుడు కుప్పకూలిపోయాడు. ఈ దాడికి సంబంధించి వీడియో గాంధీ పార్కుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. కాగా హత్య జరిగిన వెంటనే నిందితుడు జోసఫ్‌ పోలీసులకు లొంగిపోయాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని