wedding feast: పెళ్లి భోజనం తిని 100మందికి పైగా అస్వస్థత

పెళ్లి భోజనం తిని 100 మందికి పైగా అతిథులు అస్వస్థతకు గురైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

Published : 12 May 2023 19:12 IST

జైపూర్‌: వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి 100 మందికి పైగా ఆస్పత్రిపాలైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. గురువారం ఝుంజును జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో ఈ ఘటన జరిగింది. పెళ్లి భోజనం తిన్న అతిథులకు వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఉదయ్‌పుర్వాటి ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో భోజనంలో ఫుడ్‌ పాయిజన్‌ అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.   శుక్రవారం ఉదయ వరకు ఈ పెళ్లి విందు తిన్నవారిలో 100 మందికి పైగా అస్వస్థతతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినట్టు అధికారులు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా రాజ్‌కుమార్‌ డంగీ తెలిపారు. ఇప్పటికే కొందరికి వైద్యం అందించి ఇంటికి పంపించగా.. మరో 50మందికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈ విందులో వడ్డించిన స్వీట్స్‌నుంచి శాంపిల్స్‌ సేకరించి టెస్టింగ్‌ కోసం పంపినట్టు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని