Crime News: షేర్ మార్కెట్లో నష్టాలొస్తే .. అప్పుల బాధ హంతకుడ్ని చేసింది!
ఆధారాలు దొరక్కుండా మహిళను హత్య చేసిన కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు.
తాడిపత్రి: ఆధారాలు దొరక్కుండా మహిళను హత్య చేసిన కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి జిల్లా అదనపు ఎస్పీ విజయభాస్కర్రెడ్డి వివరాలు వెల్లడించారు. తాడిపత్రి నియోజకవర్గం పప్పూరు మండలంలో జనవరి 3న లక్ష్మీనారాయణమ్మ (52)హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు చంపి అరటితోటలో పూడ్చిపెట్టారు. తన చెల్లెలు కనిపించడం లేదని రమణయ్య పప్పూరు పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది.
గ్రామానికి చెందిన చల్లా నరేంద్ర షేర్ మార్కెట్లో నష్టపోయి దాదాపు రూ.5లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. బాకీలు ఎలా తీర్చాలో తెలియక ఒంటరిగా ఉన్న లక్ష్మీనారాయణమ్మ మెడలో బంగారు గొలుసు లాక్కొనే ప్రయత్నం చేశాడు. తనను చూసిన ఆమె విషయాన్ని గ్రామంలో చెబుతుందేమోనన్న భయంతో బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా అరటితోటలో శవాన్ని పూడ్చిపెట్టాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన సర్కిల్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి బంగారం గొలుసు, ఉంగరం, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు అదనపు ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఓ వ్యక్తి మైనర్ను బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది. -
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!