విద్యార్థినిపై దారుణం.. టీచర్కు పదేళ్లు జైలు శిక్ష, ₹10లక్షల జరిమానా
రాజస్థాన్లో విద్యార్థిని జీవితాన్ని నాశనం చేసిన ఓ ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠినశిక్ష విధించింది.
జైపుర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన గురువే ఓ విద్యార్థిని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఆమె లైంగిక దాడికి పాల్పడి ఆ ఘోరాన్ని వీడియో చిత్రీకరించాడు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో నిందితుడికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని బుందీ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థినిపై అదే స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే విశ్వేంద్ర మీనా(32) లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వీడియోను చిత్రీకరించి కిరాతకంగా వ్యవహరించాడు. ఈ విషయం బయటకు చెబితే వీడియోలను ఆన్లైన్లో పెడతానని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలి తండ్రికి తెలియడంతో 2016 నవంబర్ 10న పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తెపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన పోక్సో న్యాయస్థానం నిందితుడికి రూ.10లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్