Crime News: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది.

Published : 30 Nov 2022 17:31 IST

కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు  నంద్యాల జిల్లా అలగనూరుకు చెందిన యలమరాజు, ఆయన కుమారుడు నారాయణ, కర్నూలు జిల్లా తుగర్చేడుకు చెందిన వెంకటస్వామిగా గుర్తించారు. కారు డ్రైవర్‌ రఘునాయక్‌కు తీవ్ర గాయాలు కావటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని